అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ తో గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 3వ తేదీ నుంచి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ తో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణలో అధికారులు, రెవిన్యూ, పోలీసు సిబ్బంది బిజీగా ఉన్నందున పరీక్ష వాయిదా వేయక తప్పదని ఈరోజు జరిగిన టీఎస్పీఎస్సీ కమిటీ మీటింగ్లో చర్చ జరిగింది. గ్రూప్ 2 వాయిదా పడటం ఇది రెండోసారి. మొత్తం 5.51 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్2 పరీక్షకు అప్లై చేసుకున్నారు. గ్రూప్ 2 వాయిదా పడటం ఇది రెండోసారి.