నిరుద్యోగులకు శుభవార్త. ఇండియా పోస్టే పేమెంట్స్ బ్యాంకులో భారీగా ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 24వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు : 54
ఎగ్జిక్యూటివ్(అసోసియేట్ కన్సల్టెంట్): 28 పోస్టులు
ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్): 21 పోస్టులు
ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్): 5 పోస్టులు
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ/ బీటెక్ లేదా బీసీఏ/ బీఎస్సీ లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో మూడేళ్లు పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేవారికి వయసు 22- 45 ఏళ్లకు మించరాదు..
జీతం:
ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.10,00,000;
ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) పోస్టులకు రూ.15,00,000;
ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.25,00,000
దరఖాస్తు ఫీజు:
రూ.750, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకైతే రూ.150 చెల్లించాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే వాళ్లు అధికార వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో మే 24 లోపు దరఖాస్తు చేసుకోవాలి.