అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్.. గ్రూప్ 2 మరోసారి వాయిదా పడనుంది. నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. నవంబర్ 3నుంచి ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తారు. దీంతో పరీక్షల నిర్వహణ కష్టమేననీ టీఎస్పీఎస్సీ భావిస్తోంది. 5.51 లక్షల మంది పరీక్ష రాయాల్సి ఉంది. ఎగ్జామ్ సెంటర్లకు సరిపడే సిబ్బంది సర్దుబాటు కష్టమవుతుందని టీఎస్పీఎస్సీ పునరాలోచనలో పడింది. వాయిదా వేసేందుకే మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. ఎన్నికల తర్వాతే పరీక్ష నిర్వహించే ఛాన్స్ ఉంది.
మరోవైపు అదే నెలలో జరగాల్సిన డీఎస్సీ పరీక్ష వాయిదా పడే అవకాశాలున్నాయి. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షల షెడ్యూలు ప్రకటించారు. ఎన్నికలతో ఈ పరీక్షలను వాయిదా వేయాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.5089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రస్తుతం అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా, ఇప్పటికీ 54వేల మంది అప్లై చేశారు.
నవంబర్ 30న పోలింగ్ జరుగనుంది. ఆ తేదీకి ముందు నాలుగు రోజులు… తర్వాత మూడు రోజుల పాటు ఎలాంటి ఎగ్జామ్ పెట్టేందుకు అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 25 నుంచి 30 వరకూ జరిగే ఎస్జీటీ పరీక్షల నిర్వహణ కష్టమేననీ తెలుస్తోంది. అన్ని పరీక్షలు వాయిదా వేయాలా.. కొన్నింటిని పోస్ట్ పోన్ చేయాలా.. అనేది చర్చ జరుగుతోంది.
Please send me CBSE books of Mathematics of Class VI to X class for preparation of competition exam
Shivarathri bhavani