దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఒకటో తరగతిలో అడ్మిషన్లకు ఆన్లైన్ లో అప్లై చేయాలి. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ జులై 20 వ తేదీ న ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 7 వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆగస్ట్ 11, 24, 26 తేదీల్లో సెలెక్షన్ లిస్టు ప్రకటిస్తారు. 2 వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు అడ్మిషన్లకు జులై 20 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు ఆయా విద్యాలయాల్లో అప్లికేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఆయా స్కూళ్లలో అందుబాటులో ఉన్న ఖాళీల ప్రకారం అడ్మిషన్లుంటాయి. లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు కేవీ స్కూళ్లలో ప్రత్యేక కోటా ఉంటుంది. ఒక్కో ఎంపీ పది సీట్లను రెకమండ్ చేయవచ్చు. ఖాళీలకు సంబంధం లేకుండా ఎంపీల కోటాను భర్తీ చేస్తారు. లోక్సభ ఎంపీలు తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న కేవీ స్కూళ్లలో తమ కోటా వినియోగించుకోవాల్సి ఉంటుంది. రాజ్యసభ సభ్యులు దేశంలో ఎక్కడైనా తమ కోటాను వాడుకోవచ్చు.
పూర్తి వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. kvsangathan.nic.in