తెలంగాణలో ఈనెల 30న పదో తరగతి (TELANGANA SSC) ఫలితాలు విడుదల కానున్నాయి. ఎస్ఎస్సీ బోర్డు ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసింది. 30వ తేదీన ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఆఫీసులో ఫలితాలను విడుదల చేస్తారు. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియ కూడా ఇటీవలే పూర్తయింది. ఫలితాలు విడుదల చేసిన వెంటనే ఎస్ఎస్సీ బోర్డు అఫిషియల్ వెబ్సైట్లో విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులకు అందుబాటులో ఉండేలా మెరుపులు.కామ్ ఫలితాలకు సంబంధించిన డైరెక్ట్ లింక్లను కూడా అందుబాటులో ఉంచుతుంది. ఫలితాలు వెలువడిన వెంటనే వీటిని క్లిక్ చేసి రిజల్ట్ తెలుసుకోవచ్చు.
30వ తేదీ ఉదయం 11 గంటల తర్వాత TS SSC 2024 రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TS SSC 2023-24 RESULTS
TS SSC 2023-24 RESULTS LINK2
St IIT ra