కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ ను యూపీఎస్సీ ఏప్రిల్ 24న రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 506 ఖాళీలను భర్తీ చేయనుంది.ఈ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 24న ప్రారంభమైంది. మే 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్ట్స్ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్ష, మెడికల్ ఎగ్జామినేష్న, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 4వ తేదీన రాతపరీక్షన నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు తొలిసెషల్ లో పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సేషన్ లో పేపర్ 2 పరీక్షను నిర్వహిస్తారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో ఈ పరీక్షను నిర్వహిస్తారు.
మొత్తం ఖాళీలు : 506 పోస్టులు
బీఎస్ఎఫ్: 186 పోస్టులు
సీఆర్పీఎఫ్: 120 పోస్టులు
సీఐఎస్ఎఫ్: 100 పోస్టులు
ఐటీబీపీ: 58 పోస్టులు
సశస్త్ర సీమాబల్: 42 పోస్టులు
అర్హతలు:
డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
01.08.2024 నాటికి 20 – 25ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుము రూ. 200
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం:
రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు
రాతపరీక్ష విధానం:
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1: జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్కు 250 మార్కులు. ఆబ్జెక్టివ్ విధానంలో (మల్టిపుల్ ఛాయిస్) ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి
పేపర్-2: జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్కు 200 మార్కులు. అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లిష్ మాధ్యమాల్లో వ్యాసం రాయాలి. అయితే ప్రెసిస్ రైటింగ్, కాంప్రహెన్షన్, ఇతర కమ్యూనికేషన్స్/లాంగ్వేజ్ స్కిల్ మాత్రం ఇంగ్లిష్లోనే రాయాలి.
ఫిజికల్ ఈవెంట్లు..
అభ్యర్థులు 100 మీటర్లు పరుగు పూర్తిచేయాలి. పురుషులు 16 సెకండ్లలో, మహిళలు 18 సెకండ్లలో పరుగులు చేయాలి.
అదేవిధంగా 800 మీటర్ల పరుగుపందెం ఉంటుంది. పురుషులు 3 నిమిషాల 45 సెకండ్లలో, మహిళలు 4 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేయాలి.
లాంగ్ జంప్లో మూడు అవకాశాలలో పురుషులు 3.5 మీటర్లు, మహిళలు 3.0 మీటర్లు జంప్ చేయాలి.
ఇక పురుషులకు మాత్రమే షార్ట్పుట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు మూడు అవకాశాల్లో 7.26 కిలోల బరువుండే గుండును 4.5 మీటర్ల వరకు విసరాలి.
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.04.2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.05.2024.
Pay by Cash విధానంలో ఫీజు చెల్లించడానికి చివరితేది: 13.05.2024. (23.59 గంటలు)
ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.05.2024. (18.00 గంటలు)
దరఖాస్తుల సవరణకు అవకాశం: 15.05.2024 – 21.05.2024.
రాతపరీక్ష తేదీ: 04.08.2024.