విద్యార్థులకు వారానికి ఐదు రోజులే డిజిటల్ పాఠాలు చెప్పాలని స్కూల్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్లకు ఆదేశాలు జారీ చేసింది.
సెప్టెంబర్ 1 నుంచి దూరదర్శన్ యాదగిరి, టీశాట్ ఛానల్స్ ద్వారా డిజిటల్ పాఠాలు ప్రారంభమవుతాయి.
సర్కారు స్కూల్ విద్యార్థులకు మూడో తరగతి నుంచే డిజిటల్ పాఠాలు అందిస్తుంది.
ప్రైవేటు స్కూళ్లలో కిండర్ గార్డెన్, నర్సరీ, ప్రీ స్కూల్స్, ప్లే స్కూల్స్ కూడా ఆన్లైన్ పాఠాలు చెప్పుకోవచ్చు. నర్సరీ, ప్లే స్కూల్, ప్రీ ప్లే స్కూల్ విద్యార్థులకు వారంలో మూడు రోజులు… రోజుకు 45 నిమిషాలు డిజిటల్ క్లాసులు నిర్వహించుకోవచ్చు.
ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులకు వారంలో ఐదురోజులే క్లాసులు.
- ప్రతి క్లాస్ 30 నుంచి 45 నిమిషాల పాటే ఉండాలి.
- ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు రోజుకు రెండు సెషన్స్లో చొప్పున గంటన్నర.
- 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు రోజుకు మూడు సెషన్స్లో రెండు గంటలు.
- 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు రోజుకు నాలుగు విడతల్లో మూడు గంటల పాటు క్లాసులు.
పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం. ఒకటో తరగతితో పాటు ఆరో తరగతిలో అడ్మిషన్లు చేసుకోవచ్చు.
పిల్లలు బడులకు రాకున్నా, పేరెంట్స్ ఇచ్చే డిటెయిల్స్ ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలి.
బడిబయట ఉన్న పిల్లలను( బాలకార్మికులు) గుర్తించి, వారి వయస్సుకు తగిన క్లాసులో అడ్మిషన్ల కోసం టీచర్లు చర్యలు తీసుకోవాలి.
డిజిటల్ పాఠాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈనెల 27 నుంచి టీచర్లు, స్టాఫ్ రెగ్యులర్ గా స్కూల్స్ కు హాజరు కావాలి.
గ్రామస్థాయిలో నెట్ వర్క్స్ను గుర్తించి, వారికి డిజిటల్ పాఠాలు అందేలా చూడాల్సిన బాధ్యత టీచర్లదే.
టీవీలు, ఫోన్లు లేని వారికి దగ్గరలోని గ్రామపంచాయతీలు, లేదా ఇతర ప్రభుత్వ సంస్థల్లో వారిని పాఠాలు వినేలా హెడ్మాస్టర్లు, టీచర్లు చూడాలి. అక్కడా సాధ్యం కాకుంటే, స్కూల్స్లో అవకాశం కల్పించాల్సి ఉంటుంది.
అలాగే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, వర్క్ షీట్లు విద్యార్థులందరికీ చేరేలా హెడ్మాస్టర్లు చొరవ చూపాలి.
పేరెంట్స్కూడా పిల్లలు డిజిటల్ పాఠాలు వినేలా ప్రోత్సహించాలి.
డిజిటల్ పాఠాల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా, ముందుగానే ట్రాన్స్కో అధికారులతో ఎంఈఓలు సమన్వయం చేసుకోవాలి.
డీటీహెచ్, కేబుల్ టీవీల్లో టీసాట్, దూరదర్శన్ కనెక్టివిటీ అందిచేలా డీఈఓలు చొరవ తీసుకోవాలి.