కేంద్ర సర్కార్ ఈమధ్యే ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంలో భాగంగా భారత నౌకాదళంలో అగ్నివీర్ ఖాళీల నియామకానికి ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్నివీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా సెలక్ట్ అయిన అభ్యర్థులు ఐఎన్ఎస్ చిల్కాలో ప్రారంభం కానున్న 02,2024 బ్యాచ్ పేరుతో ట్రైనింగ్ ఉంటుంది. మే 13 నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురూ కానుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళ అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు
అర్హత:
అగ్నివీర్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్ రెండేళ్ల ఒకేషనల్ కోర్సు లేదా ఇంజనీరింగ్ డిప్లొమా ( మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు:
అభ్యర్థి 01-11-2023 నుంచి 30-04-2007 మధ్యలో జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఎత్తు:
పురుషులు, మహిళలు కనీసం 157సెం.మీ ఎత్తు ఉండాలి.
ఎంపిక విధానం:
అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ స్టేజ్ 1, స్టేజ్ 2 ( రాత పరీక్ష, శారీరక దార్డ్య పరీక్ష) వైద్య పరీక్షల ఆధారం సెలక్ట్ చేస్తారు.
ట్రైనింగ్ :
అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా స్టేట్ లోని ఐఎన్ఎస్ చిల్కాలో నవంబర్ నెలలో కోర్సు ట్రైనింగ్ షురూ అవుతుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ. 30వేలు, రెండో ఏడాది రూ. 33 వేలు, మూడో ఏడాది రూ. 36500, నాలుగో ఏడాది రూ. 40వేలు లభిస్తుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష:
ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మొత్తం 100 బహుళ్లైచ్చిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్ నెస్, నాలుగు విభాగాల్లో ఇంటర్మీడియెట్ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా అమల్లో ఉంది. నాలుగు తప్పుల సమాధానాలకు ఒక్క మార్కు కోత ఉంటుంది.
దరఖాస్తు ఫీజు రూ. 550
దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్ సైట్లో అప్లయ్ చేసుకోవాలి.
ఆన్ లైన్ లో దరఖాస్తు ఫీజు చెల్లింపు 13-5-2025 నుంచి ప్రారంభం అవుతుంది.
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ 27-05-2025గా పేర్కొన్నారు.
ట్రైనింగ్ 2024 నవంబర్ లో షురూ అవుతుంది.