తెలంగాణ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ (తెలంగాణ సెట్) TS SET 2022 పరీక్ష వాయిదా పడింది. ఈనెల మార్చి 13న జరగాల్సిన సెట్ పరీక్షను వాయిదా వేసినట్లు టీఎస్సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆ రోజు జరిగే పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. షెడ్యూలు ప్రకారం మార్చి 14, 15 తేదీల్లో జరిగే పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు. మార్చి 10 నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని, అభ్యర్థులు తమ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
Advertisement
Advertisement