Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఈ తేదీల్లో ఆర్మీపబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయ నియామక పరీక్షలు

ఈ తేదీల్లో ఆర్మీపబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయ నియామక పరీక్షలు

దేశంలోని పలు కంటోన్మెంట్లు, మిలటరీ స్టేషన్లలో ఆర్మీ పబ్లిక్ స్కూళ్లతో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్షల తేదీలను ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ విడుదల చేసింది. నవంబర్ 25,26వ తేదీల్లో రాతపరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పీఆర్టీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ స్క్రీమింగ్ పరీక్ష, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్ మ్యూల్యాంకనం, కంప్యూటర్ ప్రావీణ్యం ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. సికింద్రాబాద్, హైదరాబాద్ లలో ఈ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Advertisement

అడ్మిట్ కార్డు ఈ వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఆర్మీ, నేవీ, ఎయిర్​ ఫోర్స్​లో అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సైనిక్​ స్కూల్స్ ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 2024-–2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2024) నోటిఫికేషన్ విడుదల చేసింది.

సీట్ల కేటాయింపు: ఆరో తరగతి (ప్రభుత్వ- 2,970, ప్రైవేటు- 2,255) కి 5,225; తొమ్మిదో తరగతికి 697 సీట్లు కేటాయించారు.

Advertisement

అర్హతలు: ఆరో తరగతి అడ్మిషన్స్​కు విద్యార్థుల వయసు 10 నుంచి-12 ఏళ్ల మధ్యలో ఉండాలి. తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థుల వయసు13- నుంచి15 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్టంగా 25శాతం మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40శాతం మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దార్ఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు. పెన్ పేపర్ (ఓఎంఆర్‌ షీట్‌) విధానంలో నిర్వహించే రాత పరీక్షలో సాధించే మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

దరఖాస్తులు: అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో నవంబర్‌ 7 నుంచి డిసెంబర్​16 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు రూ.500, ఇతరులు రూ.650 పరీక్ష రుసుం చెల్లించాలి. 2024 జనవరి 21న పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.exams.nta.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!