ఇండియన్ ఆర్మీలో చేరాలన్న ఆసక్తి ఉన్న అభ్యర్థులకు శుభవార్త. బీటెక్ విద్యార్హతతో ఆర్మీలో సేవలందించే గొప్ప అవకాశం వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నవారితోపాటు చివరి ఏడాది చదువుతున్నవారినీ కూడా టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోకి ఇండియన్ ఆర్మీ ఆహ్వానిస్తోంది. సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూతో నియామకాలు ఉంటాయి. సెలక్ట్ అయినవారికి ట్రైనింగ్ సమయంలో స్టైఫెండ్ కూడా చెల్లిస్తారు. తర్వాత లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.
ట్రైనింగ్ :
కోర్సులోకి సెలక్ట్ అయినవారు ఇండియన్ మిలటరీ అకాడమీ, డ్రెహ్రాడూన్ లో జులై 2024 నుంచి సుమారు ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలో ప్రతినెలా రూ. 56,100 స్టైఫండ్ చెల్లిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత లెఫ్టినెంట్ హోదాతో శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరిన తర్వాత లెవెల్ 10 రూ. 56, 100వేతనంతో రూ. 15,500 మిలటరీ సర్వీస్ పే అందుతుంది. వీటికి డీఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనంగా ఉంటాయి. తర్వాత తొలి నెల నుంచి లక్షకు పైగా జీతం ఉంటుంది.
ఖాళీల సంఖ్య 30
సివిల్ పరిధిలో 7
కంప్యూటర్ సైన్స్ 7
ఎలక్ట్రికల్ అనుబంధ విభాగాల్లో 3
ఎలక్ట్రానిక్స్ అనుబంధ విభాగాల్లో 4
మెకానికల్ 7
ఇతర విభాగాల్లో 2
అర్హత:
అనుబంధ బ్రాంచీల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ పోస్టులకు ఎమ్మెస్సీ సీఎస్, ఐటీ వంటి విద్యార్హతలతోనూ ఛాన్స్ ఉంది. అన్ని ఖాళీలు కూడా అవివాహిత పురుషులే అర్హులు
వయస్సు
జులై 1,2024 నాటికి 20 నుంచి 27ఏళ్లలోపు ఉన్నవారు అర్హులు.
అక్టోబర్ 26 మధ్యాహ్నం 3 వరకు దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా స్వీకరిస్తారు.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://joinindianarmy.nic.in