రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉచితంగా ఆన్లైన్ కోర్సులు అందించేందుకు తెలంగాణ స్కిల్ అకాడమీ ‘కోర్సెరా’ సంస్థతో కలిసి పార్టనర్షిప్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఇందులో 3,800 ఆన్లైన్ కోర్సులున్నాయి. జులై 31వ తేదీ వరకు వీటిని ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు. ప్రపంచంలో పేరొందిన యేల్, ఇల్లినాయిస్, కొలంబియా యూనివర్సిటీలు, ఐఎస్బీ, ఐబీఎం, ఇంటెల్ తదితర సంస్థల భాగస్వామ్యంతో కొర్సెరా ఆన్లైన్ డిగ్రీ, సర్టిఫికెట్ కోర్సులు అందిస్తోంది. రాష్ట్రంలోని జేఎన్టీయూహెచ్, ఓయూ, కాకతీయ, మహాత్మాగాంధీ వర్సిటీల పరిధిలో చదువుతున్న విద్యార్థులందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలని స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు పిలుపునిచ్చింది. అన్ని యూనివర్సిటీల విద్యార్థులు జులై 30లోగా కోర్సెరా వెబ్సైట్లో తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. మరోవైపు టాస్క్.. రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఈ కోర్సులను ఆఫర్ చేసింది. తమ వెబ్సైట్ ద్వారా సెప్టెంబర్ 30లోగా పేర్లు నమోదు చేసుకోవాలని ప్రకటించింది. పేర్ల నమోదుకు క్లిక్ చేయండి https://www.task.telangana.gov.in