ఏపీ సర్కార్ నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. యువతలో వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రోత్సహించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాలను కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా టెన్త్ క్లాస్ నుంచి ఆపై చదువులు చదివి..ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. దీనిలో భాగంగానే నంద్యాల జిల్లాలోని కోయిలకుంట్ల మండలంలో ఎస్వీబీసీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మెగాజాబ్ మేళాను ఏర్పాటు చేసింది.
ఈనెల 21వ తేదీన నిర్వహించే ఈ మెగా జాబ్ మేళాలో 4 ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది. దీనిలో భాగంగా నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని ఎస్సీ, బీసీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఈనెల 21వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్షరింగ్ లిమిటెడ్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలు పాల్గొనున్నాయి. ఈ ఉద్యోగమేళాలో సెలక్ట్ అయిన వారికి అర్హతను బట్టి జీతం నెలకు 12వేలు చెల్లిస్తారు.
విద్యార్హతలు : పదో తరగతి నుంచి B.SC, MSC, ORGANIC CHEMISTRY, బీటెక్, ఎంబీఏ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చు. ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకోసం కే. సుబ్బన్న (9440224291), ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు skilluniverse.apssdc.inను చెక్ చేసుకోవచ్చు.