HomeLATESTపేదవిద్యార్థులకు SBI స్కాలర్ షిప్.

పేదవిద్యార్థులకు SBI స్కాలర్ షిప్.

దేశంలోని పేద విద్యార్థుల చదువును ప్రోత్సహించేందుకు ఎస్బీఐ ఫౌండేషన్ తన వంతు సహకారం అందిస్తోంది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతిభ కలిగిన విద్యార్థులను సెలక్ట్ చేసి వారి చదువులకు ఆర్థికాసాయం అందిస్తోంది. ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్ షిప్ కు దేశవ్యాప్తంగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ స్కీం కింద విద్యార్థులకు రూ. 10వేల స్కాలర్ షిప్ అందిస్తారు. అర్హులైన విద్యార్థులు నవంబర్ 30లోగా ఆన్ లైన్ https://www.sbifoundation.in/focus-area-detail/SBIF-Asha-Scholarship లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

అర్హతలు:

  • 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

-గతేడాది విద్యాసంవత్సరంలో విద్యార్థులు కనీసం 75శాతం మార్కులు సాధించి ఉండాలి.

  • దరఖాస్తు దారు కుటుంబ ఆదాయం రూ. 3లక్షలకు మించి ఉండకూడదు.

కావాల్సిన పత్రాలు:
గతేడాది విద్యాసంవత్సరం మార్కుల జాబితా. ఆధార్ కార్డు, ప్రస్తుతం అడ్మిషన్ కు సంబంధించిన ఆధారాలు ఆదాయానికి సంబంధించి ఆధారాలు ,దరఖాస్తు దారునిఫొటో

Advertisement

దరఖాస్తు విధానం:
-దరఖాస్తులు ఆన్ లైన్ విధానంలో చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్, మొబైల్ నెంబర్,జీమెయిల్ అకౌంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తును పూర్తి చేసే సమయంలో అడిగిన డాక్యమెంట్లను అప్ లోడ్ చేయాలి. నిబంధనలను అంగీకరించిన తర్వాత ప్రివ్యూపై క్లిక్ చేయాలి. అనంతరం వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకో సబ్ మిట్ చేయాలి.

-అకడామిక్ మెరిట్, ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఈ స్కాలర్ షిప్ కు సెలక్ట్ చేస్తారు. దరఖాస్తులను అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇది వన్ టైమ్ స్కాలర్ షిప్ మాత్రమే.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!