టీఎస్ కామన్ పీజీ ఎంట్రన్స్ పరీక్ష నోటిఫికేషన్ మే 15న రిలీజ్ కానుంది. పీజీ కాలేజీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెల్సీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ పీజీ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు ఈ సంవత్సం కూడా ఓయూ ఈ పరీక్షను నిర్వహించనుంది.జూన్ మూడో వారం లేదా చివరి వారంలో ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించే ఛాన్స్ ఉంది. కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2022-23 నుంచి కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులు భారీ మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఏదైనా డిగ్రీ పాసైన విద్యార్థులు, ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీ అడ్మిషన్లు పొందే అవకాశం కల్పించే విధంగా నిర్ణయించారు. ఈ మార్పు గతేడాది నుంచే అమల్లోకి వచ్చింది. విద్యార్థులు ఏ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీలో అడ్మిషన్ పొందేవిధంగా అవకాశం కల్పించారు.
ఈ ఏడాది కూడా ఇదే విధానం ఉండే ఛాన్స్ ఉంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సీటికి అప్పగించారు. https://www.osmania.ac.in/oldsite/ వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.