తెలంగాణలో దోస్త్ 2024 నోటిఫికేషన్ ఈనెల 3న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మొత్తం 3 విడతల్లో డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించింది. దీనికి సంబంధించిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ మే 6నుంచి ప్రారంభమై మే 25వ తేదీతో ముగుస్తుంది. డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణలో మే 20 నుంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని ఉన్నతా విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. మే 30 వరకు గడువు ఉంటుందన్నారు.
తొలుత ఇచ్చిన ప్రకటన ప్రకారం ఈనెల 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని ప్రకటించాలని మొదట అనుకున్నప్పటికీ విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాల వినతి మేరకు ఆ తేదీల్లో మార్పులు చెసినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. దోస్త్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారన్న సంగతి తెలిసిందే.
ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్
మే 6 తేదీ నుండి ను మే 25 వరకు మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్. 200 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుతో అవకాశం. వెబ్ ఆప్షన్ లు మే 15 నుంచి మే 27 వరకు ఇచ్చుకోవాలి. జూన్3 తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్. జూన్ 4 నుండి జూన్ 10వ తేదీ లోపు సెల్ఫ్ రిపోర్టు చేయాలి.
సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్
ఫేస్ -2 రిజిస్ట్రేషన్స్ 400 రూపాయలతో జూన్ 4 నుంచి జూన్ 13 వరకు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్లు జూన్ 4 నుండి జూన్ 14 వరకు ఇచ్చుకోవాలి. జూన్ 18వ తేదీన రెండవ దశ సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. జూన్ 19 నుంచి జూన్ 24 వరకు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి.
థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్
400 రూపాయలతో జూన్ 19 నుంచి జూన్ 25 వరకు చేసుకోవాలి. జూన్ 19 నుంచి జూన్ 25 వరకు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. జూన్ 29 మూడోదశ సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. జులై 8నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం బీకాం ఫైనాన్స్, కోర్సు బీఎస్సీ బయో మెడికల్ సైన్స్ కొత్త కోర్సులు డిగ్రీలో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలకు www.dost.cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.