ఇటీవల జరిగిన గ్రూప్ 4 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ ఎప్పుడు విడుదలవుతుందని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో జులై 1వ తేదీన టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 8180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించిన ఈ పరీక్షకు 9.12 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వీరిలో దాదాపు 80 శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. 7,62,872 మంది అభ్యర్థులు పేపర్ 1 పరీక్షకు అటెండయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్ 2కు 7.61,198 మంది హాజరయ్యారు.
పరీక్ష ముగిసి ఇప్పటికే 12 రోజులైంది. దీంతో ప్రైమరీ కీ ఎప్పుడు విడుదల అవుతుంది? అని గ్రూప్ 4 రాసిన అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే.. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తరహాలోనే పరీక్ష జరిగిన తర్వాత 15 రోజులకు ప్రైమరీ కీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈనెల 16 లేదా 17వ తేదీన గ్రూప్ 4 ప్రైమరీ కీని విడుదల చేసే అవకాశాలున్నాయని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. కానీ.. ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ఇంకా పూర్తి కాకపోవటంతో టీఎస్పీఎస్సీ కీ విడుదల తేదీలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
గ్రూప్ 4 పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం, రెండు (పేపర్ 1, పేపర్ 2) పేపర్లు ఉండటంతో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కనీసం మరో నాలుగయిదు వారాలు పట్టే అవకాశముంది. అప్పటిదాకా ప్రైమరీ కీ విడుదల చేయాలా.. వద్దా.. అనే విషయంలో బోర్డు ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ముందుగా.. ప్రైమరీ కీ ని విడుదల చేసి.. తర్వాత ఓఎంఆర్ షీట్లను ఆన్లైన్లో పెట్టే ప్రతిపాదనలను కూడా టీఎస్పీఎస్సీ పరిశీలిస్తోంది. ఒకవేళ ఓఎంఆర్ షీట్లతోనే ప్రైమరీ కీని విడుదల చేయాలనుకుంటే మరింత ఆలస్యమవటం ఖాయం. ఓఎంఆర్ పూర్తయిన తర్వాతే కీ విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంటే.. ఆగస్ట్ నెలాఖరు వరకు అభ్యర్థులు వెయిట్ చేయక తప్పదు. కీ విడుదల చేసిన తర్వాత.. అభ్యంతరాల స్వీకరణకు కొంత గడువు ఇచ్చి ఫైనల్ కీతొ పాటు టీఎస్పీఎస్సీ ఫలితాలను విడుదల చేస్తుంది.
I need a Group 2 syllabus..
bus books PDF files…. Current effires