గ్రూప్-4 ఫైనల్ కీ (TSPSC GROUP 4 FINAL KEY) ఒకటీ రెండు రోజుల్లో వెలువడనుంది. ఆగస్ట్ 28వ తేదీన టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ప్రైమరీ కీని విడుదల చేసింది. సెప్టెంబర్ 4వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించింది. మొత్తం 8180 గ్రూప్-4 పోస్టులకు 7.61 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ప్రిలిమినరీ కీతో పాటు పేపర్ 1, పేపర్ 2 ఓఎంఆర్ షీట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జులై 1వ తేదీన టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష జరిగింది.
పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం, రెండు (పేపర్ 1, పేపర్ 2) పేపర్లు ఉండటంతో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టింది. దీంతో పరీక్ష జరిగిన తర్వాత దాదాపు రెండు నెలల వ్యవధి తర్వాత టీఎస్పీఎస్సీ ప్రైమరీ కీ రిలీజ్ చేసింది. దీనిపై అభ్యంతరాలు స్వీకరఱ పూర్తయి నెల రోజులైంది. అభ్యంతరాల పరిశీలన ఇటీవలే పూర్తయిందని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో ఒకటీ రెండు రోజుల్లోనే ఫైనల్ కీ విడుదలయ్యే అవకాశాలున్నాయి. అక్టోబర్ 6, లేదా 7 తేదీల్లో ఫైనల్ కీ రిలీజ్ అవుతుందని అధికారులు సూచనప్రాయంగా వెల్లడించారు. ఫైనల్ కీ తర్వాత తుది ఫలితాలు ఇవ్వటానికి మరి కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఫైనల్ కీ విడుదలైన తర్వాత.. వారం రోజులకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేస్తోంది. ఆ తర్వాతే సెలక్షన్ లిస్ట్ ప్రకటించనుంది.