తెలంగాణలో 783 గ్రూప్-2 ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (https://www.tspsc.gov.in/) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 18న ప్రారంభించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే.. ఈ దరఖాస్తుల ప్రక్రియ రేపు అంటే ఫిబ్రవరి 16న ముగియనుంది. అభ్యర్థులు రేపు సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. గ్రూప్-4 మాదిరిగా దరఖాస్తు గడువును మరో సారి పొడిగిస్తారన్న ప్రచారం సాగుతోంది. కానీ.. గడువును పొడింగించే అవకాశం లేదని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఆఖరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఈ రోజు సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవడం బెటర్.
READ THIS: తెలంగాణ, ఏపీలో 3,746 పోస్టాఫీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు.. అప్లికేషన్ లింక్ ఇదే..
గ్రూప్-2 కింద మొత్తం 783 ఖాళీలు ఉండగా.. ఇందులో అత్యధికంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు 165, మండల పంచాయతీ అధికారి 126, నాయిబ్ తహసీల్దార్ 98, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 97 తదితర పోస్టులు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా మీ దరఖాస్తులను సబ్మిట్ చేయండి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు గ్రూప్-2 ఉద్యోగాలకు 4.63 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. గడువు ముగిసే నాటికి దరఖాస్తుల సంఖ్య 5 లక్షలు దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.