నిరుద్యోగుల్లో అత్యంత క్రేజ్ ఉన్న ఉద్యోగాల్లో ఇండియా పోస్ట్ (India Post) జాబ్స్ ఒకటి. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40889 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో.. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో 2,480 పోస్టులు, తెలంగాణా సర్కిల్ లో 1,266 ఖాళీలు ఉన్నాయి.ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు అంటే జనవరి 27న ప్రారంభం కానుంది. దరఖస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 16ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
అర్హతలు:
అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. వయో పరిమితి 18-40 ఏళ్లు ఉండాలి.
READ THIS: మరో 451 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. టెన్త్ పాసైతే చాలు.. పూర్తి వివరాలివే
అభ్యర్థుల ఎంపిక:
అభ్యర్థులు టెన్త్ లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళ, ఎస్సీ, ఎస్టీ, PwD అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
అప్లికేషన్ లింక్-Link