తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్–2021) నోటిఫికేషన్ రిలీజైంది. టెన్త్ పూర్తయిన విద్యార్థులు ఈ ఎంట్రన్స్ ద్వారా ఇంజినీరింగ్/నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు తెలంగాణ వెలర్నరీ యూనివర్సిటీ, అనుబంధ పాలిటెక్నికల్ కాలేజీల్లో ఈ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. కంపార్ట్మెంటల్ పద్ధతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్: కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మెరిట్ ఆధారంగా ఎంపిక
దరఖాస్తులు: మే 24 నుంచి జూన్ 11 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి
రూ.300 ఫైన్తో చివరితేది: 15 జూన్ 2021
ఎగ్జామ్డేట్: ఇంకా వెల్లడించలేదు
వెబ్సైట్: https://polycetts.nic.in
ఎగ్జామ్ ప్యాటర్న్;
మొత్తం150 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష ఉంటుంది. మ్యాథమెటిక్స్ 60, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30, బయాలజీ 30 ప్రశ్నలుంటాయి. ఇవన్నీ టెన్త్ సిలబస్ పరిధిలో ఉంటాయి. రెండున్నర గంటల ఎగ్జామ్ టైమ్ ఉంటుంది. ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. ఆన్సర్లు ఓఎంఆర్ షీట్లో ఆన్సర్ను బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది.
ఇంజినీరింగ్, నాన్ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలనుకునే వారు బయాలజీ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలను అటెంప్ట్ చేయవాల్సిన అవసరం లేదు. ఆ మార్కులను పరిగణలోకి తీసుకోరు.పాలీసెట్ క్వాలిఫై అవ్వాలంటే అన్ని సబ్జెక్టుల్లో కలిపి కనీసం 30 శాతం (అనగా మొత్తం 120 మార్కులకు 36 మార్కులు) సాధించాలి.
క్వాలిఫైయింగ్ మార్క్స్:
ఇంజినీరింగ్&నాన్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్: మ్యాథ్స్(60)+ఫిజిక్స్(30)+కెమిస్ట్రీ(30)=120 మార్కులు
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్: మ్యాథ్స్(60/2)+ఫిజిక్స్(30)+కెమిస్ట్రీ(30)+బయాలజీ(30)=120 మార్కులు