రాష్ట్రంలో కరోనాతో వాయిదా పడ్డ ఇంటర్ సెకండియర్ పరీక్షలను జులై 15 తర్వాత నిర్వహించే అవకాశాలున్నాయి. ప్రస్తుతమున్న కోవిడ్ పరిస్థితుల్లో 50 మార్కులకే పరీక్షలు నిర్వహిస్తారు. వీటినే వందశాతంగా పరిగణించి మార్కులు వేస్తామని బోర్డు వెల్లడించింది. స్టూడెంట్లపై ఎగ్జామ్స్ ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ టైమ్ను కూడా కుదించనుంది. ప్రస్తుతం మూడు గంటలున్న టైమ్ను గంటన్నరకు మార్చనుంది. పరీక్షలు అనుకున్న టైమ్ లో జరిగితే ఆగస్టు నెలాఖరులో రిజల్ట్ విడుదలవుతాయి. ఈనెల 29వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ను మరోసారి వాయిదా వేసింది. జూన్ మొదటి వారంలో పరిస్థితి సమీక్షించి.. 15 రోజుల ముందు షెడ్యూల్ రిలీజ్ చేస్తామని బోర్డు ప్రకటించింది.