రాష్ట్రవ్యాప్తంగా రేపు జరగాల్సిన గురుకులాల ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. కరోనా వైరస్ విజృంభణతో గురుకులాల కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ వాయిదా వేసినట్లు చీఫ్ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో అయిదో తరగతిలో అడ్మిషన్ల కోసం ఈ నెల 30న ఎంట్రెన్స్ టెస్ట్ జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారు. తదుపరి పరీక్ష నిర్వహించే తేదీ వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.
Advertisement