అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2023 తుది ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మహబూబ్నగర్కు చెందిన అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించింది.
టాప్ టెన్ ర్యాంకర్స్
ఆదిత్య శ్రీవాస్తవ తొలి ర్యాంకుతో సత్తా చాటగా.. అనిమేష్ ప్రధాన్ (2), దోనూరు అనన్య రెడ్డి(3), పీకే సిద్ధార్థ్ రామ్కుమార్ (4), రుహాని (5), సృష్టి దబాస్ (6), అన్మోల్ రాఠోర్ (7), ఆశీష్ కుమార్ (8), నౌషీన్ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10) ర్యాంకులతో మెరిశారు.
సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు
దోనూరు అనన్య రెడ్డి (3) మూడో ర్యాంకు సాధించగా, నందల సాయికిరణ్ 27, మేరుగు కౌశిక్ 82, పెంకీసు ధీరజ్రెడ్డి 173, జి.అక్షయ్ దీపక్ 196, గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ 198, నిమ్మనపల్లి ప్రదీప్ రెడ్డి 382, బన్న వెంకటేశ్ 467, కడుమూరి హరిప్రసాద్ రాజు 475, పూల ధనుష్ 480, కె.శ్రీనివాసులు 526, నెల్లూరు సాయితేజ 558, కిరణ్ సాయింపు 568, మర్రిపాటి నాగభరత్ 580, పోతుపురెడ్డి భార్గవ్ 590, కె.అర్పిత 639, ఐశ్వర్య నెల్లిశ్యామల 649, సాక్షి కుమారి 679, చౌహాన్ రాజ్కుమార్ 703, గాదె శ్వేత 711, వి.ధనుంజయ్ కుమార్ 810, లక్ష్మీ బానోతు 828, ఆదా సందీప్ కుమార్ 830, జె. రాహుల్ 873, హనిత వేములపాటి 887, కె.శశికాంత్ 891, కెసారపు మీన 899, రావూరి సాయి అలేఖ్య 938, గోవద నవ్యశ్రీ 995 ర్యాంకులు సాధించారు.