తెలంగాణ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన వారందరూ పాసైనట్లు ప్రకటించారు. మొత్తం 4,51,585 మంది విద్యార్థుల్లో 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు ఉన్నారు. 1,04,886 మంది విద్యార్థులు గ్రేడ్ -ఏ 61,887 మంది గ్రేడ్ -బి సాధించగా.. 1,08,093 మందికి సీ గ్రేడ్ వచ్చింది.
కరోనా తీవ్రత కారణంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను బోర్డు రద్దు చేసింది. ఫస్టియర్ లో వచ్చిన మార్కులే రెండో ఏడాదికి కేటాయించారు. ఇంటర్ ప్రాక్టికల్స్కు వందకు వంద శాతం మార్కులు ఇచ్చారు. గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, బ్యాక్లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులను కేటాయించారు. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇచ్చారు.ఫలితాలను
http://tsbie.cgg.gov.in,
http://examresults.ts.nic.in,
http://results.cgg.gov.in వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
మార్కుల మెమోలో తప్పులుంటే ఫిర్యాదు చేసేందుకు ఇంటర్బోర్డు అవకాశం కల్పించింది. టోల్ ఫ్రీ నెంబర్ 040 24600110కు ఫోన్ చేయాలి.
ఇంటర్ ఫలితాలు విడుదల
Advertisement
Advertisement