స్కూళ్ల రీ ఓపెనింగ్పై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. జులై ఒకటో తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ చేయాలని ఇటీవల రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. కానీ కరోనా డెల్టా వెరియంట్ ప్రమాదకరంగా ఉందని కేంద్రం ఇప్పటికే అన్నిరాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో స్కూళ్లు ఓపెన్ కాలేదు. దీంతో పాఠశాలల పునః ప్రారంభం పై తొందర పడాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జులై ఒకటో తేదీ నుంచి ఫిజికల్ క్లాసులు కాకుండా ఆన్లైన్ పద్దతిలోనే బోధన కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. కేవలం 50% ఉపాధ్యాయులు మాత్రమే హాజరు అయ్యేలా చర్యలు చేపట్టాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ని సీఎం కెసిఆర్ ఆదేశించారు.
స్కూళ్ల రీ ఓపెన్ ఇప్పుడే కాదు.. ఓన్లీ ఆన్ లైన్..!
Advertisement