HomeLATESTఈ నెల 15 నుంచే ఆ ఎగ్జామ్స్.. ఇంటర్ బోర్డ్ కీలక ప్రకటన

ఈ నెల 15 నుంచే ఆ ఎగ్జామ్స్.. ఇంటర్ బోర్డ్ కీలక ప్రకటన

తెలంగాణ ఇంటర్ బోర్డ్ (Telangana Inter Board) కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు (TS Inter Practical Exams) నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఇంటర్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15న ఈ పరీక్షలను ప్రారంభించి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించిది. ప్రతీ రోజు రెండు సెషన్స్‌లో ఈ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. మొదటి సెషన్‌ను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు.. రెండో సెషన్‌ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.

Advertisement

ఈ పరీక్షల కోసం విద్యార్థులు తమ కాలేజీ లాగిన్‌ ఐడీతో వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టికెట్లను పొందవచ్చని ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి చేయకుండా హాల్ టిక్కెట్లను జారీ చేయాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అన్ని జూనియర్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఇంటర్ ఎగ్జామ్స్ ను మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనుంది ఇంటర్ బోర్డ్.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!