తెలంగాణ టెన్త్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో 86.60% ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 88.53%, బాలురు 84.68% ఉత్తీర్ణత సాధించారు. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 99 శాతం విద్యార్థులు పాసయ్యారు. వికారాబాద్ జిల్లాలో అత్యల్పంగా 59.46 శాతం విద్యార్థులు పాసయ్యారు.
విద్యార్థులు తమ ఫలితాలను https://bseresults.telangana.gov.in/ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు. టెన్త్ ఎగ్జామ్స్ ను ఏప్రిల్ 3 నుంచి 11వ తేదీ వరకు అధికారులు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4.8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గత కొన్ని రోజుల నుంచి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ రోజు ఫలితాలు విడుదల కావడంతో వారి నిరీక్షణకు తెరపడింది.
TS Tenth Results Direct 2023 Link1
TS Tenth Results 2023 Direct Link 2