ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో రిక్రూట్మెంట్ (Employees’ Provident Fund Organisation Recruitment) నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్వో రీజియన్ల వారీగా పోస్టుల భర్తీ చేపట్టనుంది. మొత్తం 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
పోస్టులు: సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్(ఎస్ఎస్ఏ- గ్రూప్ సి)
ఖాళీలు: మొత్తం 2674 పోస్టులు భర్తీకి ఈ నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ రీజియన్లో 39, తెలంగాణ రీజియన్లో 116 ఖాళీలు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో ఎస్సీలకు 359, ఎస్టీలకు 273, ఓబీసీ(ఎన్సీఎల్)లకు 514, ఈడబ్ల్యూఎస్లకు 529, అన్ రిజర్వ్డ్కు 999 పోస్టులను కేటాయించారు.
అర్హత: డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హలవుతారు. నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలు లేదా నిమిషానికి 30 హిందీ పదాలు కంప్యూటర్లో టైపింగ్ చేయగల నైపుణ్యం ఉండాలి.
వయస్సు: అభ్యర్థులు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు, ఓబీసీలకు, ఫిజికల్లీ ఛాలెంజింగ్, ఎక్స్-సర్వీస్మెన్కు వయో పరిమితి సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.29,200 – రూ.92,300 వరకు జీతభత్యాలు ఉంటాయి.
రిటెన్ టెస్ట్: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. జనరల్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్/ జనరల్ అవేర్నెస్ (30 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఎబిలిటీ (30 ప్రశ్నలు), జనరల్ ఇంగ్లిష్ (50 ప్రశ్నలు), కంప్యూటర్ లిటరసీ(10 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ.700 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
అప్లికేషన్లు: మార్చి 27 నుంచి అప్లికేషన్లు మొదలవుతాయి. అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏప్రిల్ 26వ తేదీ అప్లికేషన్లకు తుది గడువు. 27, 28వ తేదీలలో అప్లికేషన్లను ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.