ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 15 ఏప్రిల్ 2024 నుండి ప్రారంభం అయ్యాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి మే 05, 2024చివరి తేదీగా నిర్ణయించారు. ఆన్ లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనంతరం అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామ్, కంప్యూటర్ స్కిల్ టెస్టులతో కూడిన ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు -37
జీత భత్యాలు: రూ. 48,440-1,37,220
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామ్, సీపిటి
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: 18 ఏళ్ల నుంచి 30ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5ఏళ్ల వరకు వయోపరిమితి, దివ్యాంగులకు 10 రిలాక్సేషన్ ఇచ్చారు.
అధికారిక వెబ్సైట్– psc.ap.gov.in
ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 370, మిగతా అభ్యర్థులకు 120 రూపాయలు.
స్క్రీనింగ్ టెస్టు:
స్క్రీనింగ్ టెస్టులో 75 మార్కుల చొప్పున రెండు భాగాలు ఉంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పుకు 1/3వ మార్కు చొప్పున నెగిటివి మార్క్ ఉంటుంది. మొత్తం పరీక్షకోసం అభ్యర్థులకు 150నిమిషాల సమయం ఇస్తారు.
మెయిన్స్ పరీక్ష:
ఈమెయిన్స్ పరీక్షలో 5 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో క్వాలిఫైయ్ కావాలి. మెరిట్ జాబితాకు రావాలంటే అభ్యర్థులు 2-5 వరకు మిగిలిన పేపర్లలో మంచి మార్కులు సాధించడం తప్పనిసరి.ప్రశ్నలు అబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి. తప్పు ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పు సమాధానాలకు 1/3నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.