Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఅడ్డంకులు తొలిగాయి.. వారం రోజుల్లో ఎస్​ఐ, కానిస్టేబుల్​ ఎగ్జామ్​ రిజల్ట్స్​

అడ్డంకులు తొలిగాయి.. వారం రోజుల్లో ఎస్​ఐ, కానిస్టేబుల్​ ఎగ్జామ్​ రిజల్ట్స్​

ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ ఎగ్జామ్​ రిజల్ట్ వారం రోజుల్లో విడుదల కానుంది. తెలంగాణ స్టేట్​ పోలీస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు (TSLPRB) అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. కటాఫ్​ మార్కులు, అందుకు సంబంధించిన కోర్టు కేసుల అడ్డంకులన్నీ తొలిగిపోవటంతో.. ఈ వారంలోనే ఫలితాలు వెల్లడించే అవకాశముందని బోర్డు అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

ఆగస్టు 1న ఎస్​ఐ, ఆగస్టు 28న కానిస్టేబుల్​ పరీక్ష నిర్వహించారు. 554 ఎస్​ఐ పోస్టులకు 2,41, 217 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. 16,821 కానిస్టేబుల్​ పోస్టులకు 600855 మంది పోటీ పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్​ మిలిటరీ అభ్యర్థుల కటాఫ్‌ మార్కుల విషయంలో ఆందోళనలు తలెత్తాయి. దీంతో ఫలితాల ప్రక్రియ వాయిదా పడింది.

అభ్యర్థుల విజ్ఞప్తులకు స్పందించిన సీఎం కేసీఆర్​ కటాఫ్‌ మార్కులను తగ్గిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో ప్రభుత్వం ఈనెల 2వ తేదీన కటాఫ్​ మార్కులపై జీవో జారీ చేసింది. బీసీలకు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక అభ్యర్థులకు 40 మార్కులుగా నిర్ణయించింది. ఓసీ అభ్యర్థుల కటాఫ్​ (60 మార్కులు)లో ఎలాంటి మార్పు లేదు. ఈ జీవోకు అనుగుణంగా కటాఫ్‌ మార్కులను సవరించి.. ప్రిలిమ్స్​ రిజల్ట్ విడుదల చేసేందుకు బోర్డు తుది కసరత్తు చేస్తోంది. కటాఫ్​ మార్కులకు సంబంధించిన కోర్టులో ఉన్న కేసు కూడా క్లోజయింది. దీంతో వారం రోజుల్లో రిజల్ట్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. పరీక్ష నిర్వహించి దాదాపు రెండు నెలలు కావస్తుండటంతో దాదాపు ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రిలిమ్స్​ ఫలితాల అనంతరం నవంబర్​లో ఫిజికల్​ ఎఫిషియన్స్​ టెస్టులతో పాటు, ఈవెంట్స్​ నిర్వహించనున్నారు. రిజల్ట్స్​తో పాటే ఈవెంట్స్​ తేదీల వివరాలను వెల్లడిస్తారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!