ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం కింద అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. నెట్వర్క్, సెక్యూరిటీ, స్పెషలిస్ట్, రూటింగ్ అండ్ స్వీచింగ్ విభాగాల్లో మొత్తం 48 ఖాళీలున్నట్లు ప్రకటన జారీ చేసింది. కనీసం 60 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ పాసైన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వయసు 40ఏళ్లు మించకూడదు.
ఈ పోస్టుల సెలెక్షన్ ప్రాసెస్ ప్రకారం ముందుగా ప్రొవిజనల్ నాలెడ్జ్ టెస్ట్ ఆన్లైన్లో నిర్వహిస్తారు. అందులో మెరిట్తో పాటు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష 100 మార్కులకు ఆన్లైన్లో నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పు జవాబుకు నాలుగోవంతు మార్కు కట్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా ఎస్బీఐ బ్రాంచీల్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.
అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఫిబ్రవరి 25 చివరి తేది. దరఖాస్తు ఫీజు రూ.150 ఉంటుంది. మార్చి 20న ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు.
వెబ్సైట్ : www.sbi.co.in