HomeLATESTడిగ్రీ సెమిస్టర్​ పరీక్షల మోడల్ మారింది​

డిగ్రీ సెమిస్టర్​ పరీక్షల మోడల్ మారింది​

డిగ్రీ సెమిస్టర్​ పరీక్షల్లో ఛాయిస్​ ప్రశ్నలు పెంచాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈమేరకు అన్ని యూనివర్సిటీలకు తగిన సూచనలు చేసింది. రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీల వైస్​ చాన్స్​లర్లలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్​ ఆచార్య ఆర్​ లింబాద్రి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సెమిస్టర్​ పరీక్షల నిర్వహణతో పాటు చాయిస్​ ప్రశ్నలపై చర్చ జరిగింది. కరోనా కారణంగా క్లాసులు సరిగా జరగకపోవటంతో పరీక్షల్లో విద్యార్థులకు ఛాయిస్​ ప్రశ్నలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

డిగ్రీ పరీక్షల్లోని ప్రశ్నాపత్రాల్లో ‘సెక్షన్​ బీ’ లో ఏ లేదా బీ రాయండి అనే నిబంధనను మార్చి ‘ ఇచ్చిన ప్రశ్నల్లో మీకిష్టమైన వాటికి సమాధానాలు రాయండి’ అని మార్చాలని నిర్ణయించారు. దీంతో విద్యార్థులకు సెమిస్టర్​ పరీక్షల్లో ఛాయిస్​ పెరగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష సమయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని.. 3 గంటల్లో పరీక్ష పూర్తి చేయాలని తెలిపారు.

డిగ్రీ ఫస్ట్​ సెమిస్టర్​కు ఫిబ్రవరి 17 వరకు క్లాసులు నిర్వహించి 18 నుంచి 25వరకు ప్రిపరేషన్​ హాలిడేస్​, ప్రాక్టికల్స్​ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28నుంచి మార్చి 24 వరకు సెమిస్టర్ పరీక్షలు జరపాలని నిర్ణయించారు.

వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లో పలు కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకోసం సీపీగేట్​ కౌన్సెలింగ్​ మరోసారి జరపాలని మీటింగ్​లో నిర్ణయించారు. ఇప్పటికే మూడు విడతల్లో కౌన్సెలింగ్​ నిర్వహించగా మిగిలిన సీట్ల భర్తీకి నిర్వహించే ఈ చివరి కౌన్సెలింగ్​ను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు కోరారు.

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

NEWS MIX

గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనె ధరలు.. ఎంతో తెలుసా?

ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న పేదలకు కేంద్రం ప్రభుత్వం తీపికబురు అందించింది....

తెలంగాణ రైతులకు కేసీఆర్ భరోసా.. అదిరిపోయే శుభవార్త

అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు...

Telangana New Secretariat తెలంగాణ కీర్తి పతాక: కొత్త సచివాలయం విశేషాలివే

తెలంగాణ పరిపాలనకు గుండె లాంటి సచివాలయం కొత్త రూపును సంతరించుకుంది. తెలంగాణ...

సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం!

భారాస (టీఆర్ఎస్) 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ భవన్ లో ఘనంగా...
x
error: Content is protected !!