ఇంటర్ పాసైన విద్యార్థులకు మెరిట్ ఆధారంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ) ఇచ్చే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ల సెలెక్షన్ (ప్రొవిజినల్) జాబితా 2021 విడుదలైంది. ఇందులో పేరున్న విద్యార్థులందరూ నవంబర్ 31 వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్ పాసై ఉన్నత విద్యను చదవాలనుకునే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఈ మెరిట్ స్కాలర్షిప్లను అందిస్తోంది.
ఐదేళ్లపాటు ఈ స్కాలర్షిప్ చెల్లిస్తుంది.
మొదటి మూడేళ్ళు సంవత్సరానికి రూ .10 వేలు, తరువాత రూ .20,000 చొప్పున ఇస్తారు.
ఇంటర్ మార్కుల ఆధారంగా, ఈ ఏడాది స్కాలర్షిప్లకు తెలంగాణ నుంచి ప్రొవిజనల్గా 6670 0 మందిని ఎంపిక చేసినట్లు ఎంహెచ్ఆర్డీ ప్రకటించింది. వీరు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఈసారి 81594 మందిని ఎంపిక చేసింది.
ప్రొవిజనల్గా ఎంపికైన జాబితాను తెలంగాణ ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. ఈ జాబితా పీడీఎఫ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లిస్టులో పేరున్న విద్యార్తులందరూ సంబంధిత అధికారిక స్కాలర్షిప్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
పీడీఎఫ్ డౌన్ లోడ్ లింక్;
