నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ అప్లికేషన్స్కు గడువును నవంబర్ 7వ తేదీ వరకు పొడిగించినట్లు పాఠశాల పరీక్షల విభాగం ప్రకటించింది. మెరిట్ స్టూడెంట్లను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఏటా నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షిప్ (NMMSS) స్కీమ్ను అమలు చేస్తోంది. దీని ద్వారా పేద విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కౌలర్షిప్(Scholarship) మంజూరు చేస్తోంది. అర్హత ఉన్న విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) అధికారిక వెబ్సైట్ scholarships.gov.in ద్వారా కొత్త అప్లికేషన్లు పెట్టుకోవచ్చు, రెన్యువల్ చేసుకోవచ్చు.
ఈ ఏడాదికి సంబంధించిన స్కాలర్షిప్ స్కీమ్ అప్లికేషన్స్కు (Applications) గడువును నవంబర్ 7 వరకు పొడిగించారు. దీంతో అర్హత ఉన్న విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్(NSP) అధికారిక వెబ్సైట్ scholarships.gov.in ద్వారా అప్లికేషన్లు నమోదు చేసుకోవాలి.
ఎన్ఎంఎంఎస్ఎస్ స్కాలర్షిప్ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవాలంటే.. విద్యార్థులు 7వ తరగతి వార్షిక పరీక్షలో కనీసం 55 శాతం మార్కులు లేదా అందుకు సమానమైన గ్రేడ్ స్కోర్ చేసి ఉండాలి. ఇక, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు 50శాతం మార్కులు వచ్చి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 3,50,000 లోపు ఉండాలి.
NMMSS స్కాలర్షిప్ స్కీమ్
- ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి రూ.12,000 స్కాలర్షిప్ ఇవ్వనున్నారు. తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్ వరకు స్కాలర్షిప్ అందనుంది. ఏటా కొత్తగా లక్ష స్కాలర్షిప్లను మంజూరు చేస్తారు.
- రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ మంజూరు చేయనున్నారు.
- ఈ స్కాలర్షిప్ పథకానికి విద్యార్థులను ఎంపిక చేయడానికి అర్హత పరీక్ష నిర్వహించనున్నారు.
- విద్యార్థులు దరఖాస్తు ఫారమ్ను నింపేటప్పుడు తమకు సంబంధించిన బ్యాంక్ వివరాలను సమర్పించాలి. బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి.
- 8వ తరగతిలో డ్రాపౌట్లను నివారించడానికి, సెకండరీ ఎడ్యుకేషన్లో పేద విద్యార్థులు తమ విద్యను కొనసాగించేలా ప్రోత్సహించడమే ఈ స్కీమ్ లక్ష్యం.