2022-2023 విద్యాసంవత్సరానికి గాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాల కోసం ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్( సీయూసెట్)ను జూలై చివరి వారంలో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. ఈ ఎంట్రెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 42 సెంట్రల్, ఇతర విశ్వవిద్యాలయాల్లో సింగిల్విండ్ ప్రవేశాలు కల్పించనుంది. గతంలో యూనివర్సిటీల వారీగా వేర్వేరుగా ఎంట్రెన్స్లు నిర్వహించేవారు. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రెన్స్ నిర్వహించడం ఇదే తొలిసారి..
ఎన్టీఏ వెబ్సైట్లో నేటి నుంచి(మే 19) జూన్ 18 వరకు సీయూసెట్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్గా నిర్వహించనున్నట్టు యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీల వారీగా అందుబాటులో ఉన్న ప్రోగ్రామ్ల వివరాలు https://nta.ac.in/ వెబ్సైట్లో పెట్టినట్టు తెలిపారు.
RELATED POST
జూన్ లేదా జులైలో సీయూ సెట్