దేశంలో అత్యున్నత ఉద్యోగాలైన సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC విడుదల చేసింది. జూన్ లో ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగనుంది. ఇండియన్ బ్యూరోక్రసీలో అత్యున్నతమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి కేంద్ర సర్వీసులకు నిర్వహించే పరీక్ష కావటంతో లక్షలాది మంది ఎదురుచూస్తున్న ఈ నోటిఫికేషన్కు ఎలా అప్లై చేయాలి.. ఎలా ప్రిపేర్ కావాలి.. పూర్తి వివరాలు.. ఈసారి మొత్తం 861 ఖాళీలు ఉన్నాయి.
సివిల్స్ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం డిగ్రీ పాసై ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.
ప్రిలిమ్స్లో పాస్ అయితే మెయిన్స్కు అప్లై చేసేటపుడు వారు డిగ్రీ సర్టిఫికేట్ సమర్పించాలి. జనరల్ అభ్యర్థులు 6 సార్లు, ఓబీసీలు 9, దివ్యాంగులు 9 సార్లు పరీక్ష రాసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు అటెంప్ట్స్ పై పరిమితి లేదు.
మొత్తం ఖాళీలు: 861
అర్హత: ఏదైనా డిగ్రీ.
వయసు: 1 అగస్టు 2022 నాటికి 21-32 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ
దరఖాస్తు చివరితేదీ: 22 ఫిబ్రవరి 2022
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 5 జూన్ 2022
వెబ్సైట్: https://www.upsc.gov.in/
ఎగ్జామ్ ప్యాటర్న్:
సివిల్స్ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల్లో జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్షలో జనరల్ స్టడీస్ (పేపర్-1), సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (పేపర్-2) ఆబ్జెక్టివ్ పద్ధతిలో నాలుగు వందల మార్కులకు ఉంటాయి. సమయం రెండు గంటలు
పేపర్ 2 క్వాలిఫైయింగ్ పేపర్. దీనిలో కనీసం 33 శాతం మార్కులు రావాలి. ప్రిలిమ్స్ మార్కులను మెరిట్లో పరిగణనలోకి తీసుకోరు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.33 శాతం కోత విధిస్తారు.
మెయిన్స్లో డిస్క్రిప్టివ్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ కలిపి ఉంటాయి.
రాత పరీక్షలో కన్వెన్షనల్ (ఎస్సే) పద్ధతిలో మొత్తం 9 పేపర్లుంటాయి.
వీటిలో రాజ్యాంగం 8వ షెడ్యూల్లో పేర్కొన్న భాషతో పాటు ఇంగ్లిష్ అనే రెండు లాంగ్వేజ్ పేపర్లు ఉంటాయి. ఇవి క్వాలిఫైయింగ్ పేపర్లు మాత్రమే.
వీటిలో అర్హత మార్కులు సాధిస్తేనే మిగిలిన జీఎస్ పేపర్లు వాల్యుయేషన్ చేస్తారు.
వీటితో పాటు ఏడు కంపల్సరీ పేపర్లుంటాయి. మెయిన్స్ లో 26 సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టును ఆప్షనల్గా ఎంచుకోవచ్చు. చివరి దశలో 275 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. సివిల్స్ పరీక్ష మొత్తం 2075 మార్కులకు నిర్వహిస్తారు. ఫైనల్గా సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు సర్వీస్ కేటాయిస్తారు.
ప్రిలిమ్స్ సిలబస్
పేపర్-1
⦁ జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు
⦁ భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం
⦁ భారత, ప్రపంచ భౌగోళికశాస్త్రం – ప్రపంచ, భారత దేశ భౌతిక, సామాజిక, ఆర్థిక భౌగోళిక శాస్త్రం
⦁ భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన – రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయతీరాజ్, పౌర విధానం, హక్కుల సమస్యలు, తదితర అంశాలు
⦁ ఆర్థిక, సామాజిక అభివృద్ధి – సమ్మిళిత అభివృద్ధి, పేదరికం, ద్రవ్యోల్బణం, డెమోగ్రాఫిక్స్, సామాజిక రంగ కార్యక్రమాలు
⦁ పర్యావరణం, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు- సాధారణ అంశాలు
⦁ జనరల్ సైన్స్
పేపర్-2
⦁ కాంప్రెహెన్షన్
⦁ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇన్క్లూడింగ్
⦁ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ
⦁ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్
⦁ జనరల్ మెంటల్ ఎబిలిటీ
⦁ బేసిక్ న్యూమరసీ (పదోతరగతి స్థాయి)
⦁ డేటా ఇంటర్ప్రిటేషన్
కంబైన్డ్ ప్రిపరేషన్
సివిల్స్ రాసే అభ్యర్థులు మొదటి నుంచే ప్రిలిమ్స్తో పాటే మెయిన్స్పై కూడా ఫోకస్ చేయాలి.
ఆప్షనల్ కీలకం
ఆప్షనల్లో రెండు పేపర్లకు లోతైన ప్రిపరేషన్ అవసరం. అభ్యర్థులు సిద్ధం చేసుకున్న సొంత మెటీరియల్ను ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. ఏ ఒక్క చాప్టర్ వదిలిపెట్టకుండా చదవాలి. ఆప్షనల్ సబ్జెక్టు ఏదైనా పీజీ స్థాయిలో ప్రిపరేషన్ ఉంటేనే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
తెలుగులోను సర్వీస్ సాధించవచ్చు
ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాం, ఇంగ్లిష్లో మాట్లాడటం రాదు. రాయడం అంతత మాత్రమే.. సివిల్స్ సాధించలేమనే అపోహ చాలా మందిలో ఉంటుంది. ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే తెలుగు మీడియంలో పరీక్ష రాసి మంచి సర్వీస్ సాధించవచ్చు.