రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను జులై 1 నుంచి తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర కేబినేట్ విద్యాశాఖను అదేశించింది. అందుకు పూర్తి సన్నద్దంగా ఉండాలని సూచించింది.
విద్యా సంస్థలు పున: ప్రారంభం అవుతున్ననేపథ్యంలో… విద్యార్ధుల తప్పనిసరి హాజరు, ఆన్ లైన్ క్లాసుల కొనసాగింపు, తదితర నిబంధనలు, విధి విధానాలకు సంబంధించిన ఆదేశాలను.. విడుదల చేయాలని విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది. కరోనా భయం వెంటాడుతుండటంతో ఆఫ్ లైన్ తో పాటు ఆన్లైన్ తరగతులు కొంతకాలం కొనసాగించే అవకాశముంది. రేపటి నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. కరోనా పూర్తి స్థాయిలో నియంత్రణకు., ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరింది.
జులై 1 నుంచి స్కూళ్లు.. కాలేజీలు రీ ఓపెన్
Advertisement