ఏపీలోని 33 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ను ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది. అర్హులైన పదో తరగతి ఉత్తీర్ణులైన గిరిజన, గిరిజనేతర విద్యార్థులు మే 15లోగా ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు, సీట్ల వివరాలు :
ఎంపీసీ -1340, బైపీసీ -1340, సీఈసీ -900, హెచ్ఈసీ -720, ఎంఈసీ -40, ఎఆండ్ టి -280, సీజీఏ 90.
మొత్తం సీట్లు -4710
అర్హతలు :
2023-24 విద్యా సంవత్సరంలో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కౌన్సెలింగ్ ఆధారం సెలక్ట్ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ : 15-05-2024
మెరిజ్ జాబితాల వెల్లడి : 20-05-2024
కౌన్సెలింగ్ నిర్వహణ : 22-05-2024
ఫేజ్ 1 అడ్మిషన్లకు చివరి తేద : 01-06-2024
తరగతుల ప్రారంభం : 01-06-2024