ఈ ఏడాది జులై 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. ఈ పరీక్షలను ఐఐటీ ఖరగ్పూర్ నిర్వహించనుంది. గతంలో ఉన్న 75 శాతం మార్కుల ఎలిజిబులిటీని రద్దు చేసింది. 12వ తరగతిలో 75 శాతం మార్కులు లేకున్నా ఈ పరీక్షల రాయడానికి అర్హులేనని ప్రకటించింది. కరోనా కారణంగా రెండవ దశ పరీక్షకు హాజరు కాలేకపోయిన 2020 JEE మెయిన్స్లో అర్థత సాధించిన అభ్యర్థులను 2021 జెఇఇ అడ్వాన్స్డ్ 2021 ఎగ్జామ్ డైరెక్ట్ గా రాసేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ఈ ఏడాది జెఇఇ మెయిన్ 2021 పరీక్షకు అర్హత సాధించడానికి ఫోర్ సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఫిబ్రవరి 23 నుండి 26 వరకు జరుగుతుంది. మే నాల్గవ సెషన్ ముగిసిన తర్వాత జెఇఇ మెయిన్ 2021 మెరిట్ జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ) విడుదల చేస్తుంది..