నీట్, ఐఐటి జెఇఇ అడ్వాన్స్డ్, జెఇఇ మెయిన్, సిబిఎస్ఇ బోర్డు పరీక్షలు
సిబిఎస్ఇ బోర్డు పరీక్షలు, జెఇఇ మెయిన్ 2021 తేదీలు ఇప్పటికే విడుదలయ్యాయి. జెఇఇ అడ్వాన్స్డ్, నీట్ 2021 షెడ్యూల్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. సీబీఎస్ఈ బోర్డు 10, 12 క్లాసులు, ఇంజనీరింగ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జెఇఇ మెయిన్ మరియు జెఇఇ అడ్వాన్స్డ్ 2021), మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ 2021), వివిధ రాష్ట్ర బోర్డు పరీక్షలతో సహా దేశమంతటా జరిగే ప్రధాన పరీక్షలు, ఎంట్రన్స్ లన్నింటిపై ఈపారి కోవిడ్ ప్రభావం పడింది. క్లాసులు జరగకపోవటం, కోచింగ్కు తగినంత సమయం లేకపోవటంతో ఈ పరీక్షలన్నింటినీ జూన్ వరకు వాయిదా వేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోని కేంద్ర ప్రభుత్వం ఒక్కటొక్కటిగా పరీక్షల షెడ్యూలును విడుదల చేస్తోంది.
జెఇఇ మెయిన్ 2021
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మరియు మే నెలల్లో జెఇఇ మెయిన్ 2021 కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ) నాలుగు ఫేజ్లను ప్రకటించింది. ఫస్ట్ ఫేజ్ ఫిబ్రవరి 23 నుండి 26 వరకు ఉంటుంది. దీనికి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 16. జేఈఈ మెయిన్ అభ్యర్థులు మొత్తం 90 ప్రశ్నలలో 75 ప్రశ్నలను అటెంప్ట్ చేసే విధంగా ప్రశ్న పత్నంలో మార్పులు చేశారు. ఈసారి ఎంట్రన్స్ తెలుగుతో పాటు11 ప్రాంతీయ భాషలలో నిర్వహిస్తున్నారు. తదుపరి ఫేస్ పరీక్షల తేదీలు తరువాత ప్రకటిస్తారు.
జెఇఇ అడ్వాన్స్డ్ 2021
జెఇఇ అడ్వాన్స్డ్ 2021 తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ జనవరి 7న ప్రకటిస్తారు. ‘నిశాంక్’ పేరిట జరిగే లైవ్ ప్రోగ్రాంలో వివిధ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) లలో అడ్మిషన్ల విధానాన్ని ఆయన ప్రకటించనున్నారు. నిరుడు కోవిడ్ కారణంగా JEE అడ్వాన్స్డ్ 2020కు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు తిరిగి JEE మెయిన్ 2021 రాయాల్సిన అవసరం లేకుండానే.. నేరుగా JEE అడ్వాన్స్డ్ 2021కు హాజరయ్యే అవకాశం కల్పించనుంది.
నీట్ 2021
మెడికల్ సీట్లకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (నీట్) 2021 కు సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఎంబీబీఎస్ ఆశిస్తున్న అభ్యర్థులు జేఈఈ మెయిన్, అడ్వాన్స్ తరహాలో ఈ ఎంట్రన్స్ తేదీలు రెండు ఫేజ్లుగా ఉండాలని కోరుతున్నారు. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ) త్వరలో ప్రకటించే నీట్ సిలబస్ తో పాటే నీట్ 2021 నిర్వహించే తేదీల షెడ్యూల్ను విడుదల చేయనుంది.
సిబిఎస్ఇ బోర్డు పరీక్ష 2021
సీబీఎస్ఈ బోర్డు 10 మరియు 12 తరగతుల బోర్డు పరీక్షలు మే 4 కి వాయిదా పడ్డాయి. కోవిడ్ కారణంగా ప్రాక్టికల్ పరీక్షలను రద్దు చేయాలని ఈసారి విద్యార్థులు కోరినప్పటికీ బోర్డు తిరస్కరించింది. మార్చి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఈ ఏడాది సిలబస్ను సీబీఎస్ఈ బోర్డు 30 శాతం తగ్గించింది.