జవహర్ నవోదయ విద్యాలయాల్లో 11 వ తరగతిలో ప్రవేశాలకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో 11 వ తరగతిలో ఖాళీ గా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. దీన్ని లేటరల్ ఎంట్రీ విధానంగా పరిగణిస్తారు.
2019-20 విద్యా సంవత్సరంలో టెన్త్ చదివిన విద్యార్థులందరూ ఇందులో అడ్మిషన్లు పొందేందుకు అర్హులు. టెన్త్ లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ సెలెక్షన్ లిస్టును ప్రకటిస్తారు. ఎన్ సీసీ, స్పోర్ట్స్ లో ప్రతిభ ఉన్నవారికి అదనపు ప్రాధాన్యం ఇస్తారు.
పూర్తి వివరాలకి సమీపంలో అందుబాటులో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ని సంప్రదించవచ్చు లేదా కింది లింక్ను క్లిక్ చేయండి.
ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి చివరి గడువు: ఆగస్ట్ 31
పూర్తి వివరాలకు; https://navodaya.gov.in/nvs