సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది సీబీఎస్ఈ బోర్డు పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. విద్యార్థులు పూర్వ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగింది. మొత్తం 91.46 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురతో పోలిస్తే బాలికల ఉత్తీర్ణత 3.17 శాతం ఎక్కువ. త్రివేండ్రం ప్రాంతం 99.28 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. గువాహటి ప్రాంతం 79.12 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. అన్ని పరీక్షలు రాసిన 10 తరగతి విద్యార్థుల ఫలితాలను యథావిధిగా ప్రకటించారు. మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు రాసిన విద్యార్థులకు .అత్యుత్తమ మార్కులు సాధించిన మూడు సబ్జెక్టుల సగటు ఆధారంగా ప్రతిభను మదింపు చేశారు. 3 సబ్జెక్టులకు మాత్రమే హాజరైన విద్యార్థులకు.. 2 సబ్జెక్టులలో సాధించిన అత్యుత్తమ మార్కుల సగటు, అంతర్గత, ప్రాక్టికల్ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా తుది మార్కులు కేటాయించారు.
రిజల్ట్ తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి… cbse.nic.in