తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియేట్ ప్రవేశాలకోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ‘సీఓఈ’ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎస్డబ్ల్యూఆర్జేసీ అండ్ సీఓఈసెట్ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ ద్వారా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ గ్రూపులతో పాటు ఒకేషనల్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఐఐటీ, నీట్ పరీక్షలకు సంబంధించి ప్రత్యేక కోచింగ్ ఇస్తారు.
ఈ విద్యాసంవత్సరం పదోతరగతి పరీక్షలు రాసే ఇంగ్లీష్ లేదా తెలుగు మీడియం విద్యార్థులు ఈ ఎంట్రెన్స్ రాసి అడ్మిషన్లు పొందవచ్చు. వయసు ఆగస్ట్ 31 నాటికి 17ఏళ్ల లోపు ఉండాలి. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. లక్షా 50వేలు, పట్టణాల్లో రూ.2లక్షల లోపు ఉండాలి.
పరీక్ష ఎలా ఉంటుంది;
గురుకుల ఎంట్రెన్స్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో 150 మార్కులకు నిర్వహిస్తారు.
ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున ఉంటుంది.
ఇందులో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులనుంచి ఒక్కో దానిలో 30 ప్రశ్నలు అడుగుతారు.
ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి ఒక్కోదానిలో 15 ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పు జవాబుకు 0.25 మార్కు కోత విధిస్తారు.
ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 25 చివరితేది. పరీక్ష ఫీజు రూ.100 ఉంటుంది. ఫిబ్రవరి 20న ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.
వెబ్సైట్ : www.tsswreisjc.cgg.gov.in