తెలంగాణ ఐసెట్ (TS ICET 2023) ఫలితాలు విడుదలయ్యాయి. కాకతీయ యూనివర్సిటీలో ఐసెట్- 2023 ఎంట్రన్స్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి రిలీజ్ చేశారు. కేయూ వీసీ ప్రొఫెసర్ రమేష్, ఐసెట్ కన్వీనర్ వరలక్ష్మి ఫలితాలను విడుదల చేసినట్లు ప్రకటించారు. ఎంబీఏ, ఎంసిఏ కోర్సుల్లో అడ్మిషన్లకు ఐసెట్ ఎంట్రన్స్ నిర్వహించారు. ఈ పరీక్షకు 70,900 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 61,092 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. నెల రోజుల్లో ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల అడ్మిషన్లకు షెడ్యూల్ రిలీజ్ చేస్తామని ప్రొఫెసర్ లింబాద్రి ప్రకటించారు. ఐసెట్ ఫలితాల్లో సూర్యాపేట జిల్లాకు చెందిన నూకల శ్రావణ్ కుమార్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు.