టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ అప్లికేషన్ల గడువును పొడగించారు. ఈనెల 29 వరకూ ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు . రూ.500 ఫైన్తో మే 4 వరకూ, వెయ్యి ఫైన్తో మే 8 వరకూ, రూ.4 వేల ఫైన్ తో మే 12 వరకూ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ 35,072 అప్లికేషన్లు వచ్చాయనీ అధికారులు తెలిపారు. సెంటర్లు తక్కువగా ఉండటంతో..త్వరగా అప్లై చేసుకొని దగ్గరలోని సెంటర్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. మే 25న లాసెట్ పరీక్ష జరగనున్నది.
ఎడ్ సెట్ దరఖాస్తు గడువు 25వరకూ..
ఎడ్ సెట్ దరఖాస్తు గడువునూ ఈనెల 25 వరకూ పొడిగించారు. డిగ్రీ ఫైనలియర్ స్టూడెంట్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకూ 21,456 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు.