విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు, ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. Test of English as a Foreign Language (TOFEL) రాయడం ఇకపై మరింత ఈజీ కానుంది. ఎందుకంటే ఈ పరీక్ష విధానంలో కీలక మార్పులు చేశారు. దీంతో పరీక్ష సమయం 3 గంటల నుంచి 2 గంటలకు తగ్గనుంది. ఇంకా ఈ ఎగ్జామ్ ముగిసన వెంటనే విద్యార్థులు తమ అధికారిక స్కోర్ విడుదలయ్యే తేదీని సైతం తెలుసుకోవచ్చని ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ETS) తెలిపింది. ఆంగ్ల భాష ప్రావీణ్యతకు సంబంధించిన టోఫెల్, గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్స్ (GRE) రాసేవారికి అనుకూలాంగా కొన్ని మార్పులు చేసినట్లు ఈటీఎస్ సీఈఓ అమిత్ సేవక్ తెలిపారు. ఈ మార్పులు జులై 26 నుంచి అమలులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. చిన్న రీడింగ్ సెక్షన్తో పాటు దానికి సంబంధించిన ‘ఇండిపెండెంట్ రైటింగ్’ స్థానంలో ‘రైటింగ్ ఫర్ యాన్ అకడమిక్ డిస్కషన్’ పూర్తి చేయాల్సి ఉంటుంది. భారతీయ అభ్యర్థులకు కస్టమర్ హెల్ప్ లైన్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ సంస్కరణలన్నీ ఈ ఏడాది జులై 26 నుంచి అమల్లోకి వస్తాయని ఈ టెస్ట్ నిర్వహించే ది ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) వెల్లడించింది.
ఇదిలా ఉంటే. టోఫెల్ స్కోరును ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్, కెనడా, ఇంగ్లాండ్ తో పాటు మొత్తం 190 దేశాల్లో దాదాపు 10వేలకు పైగా యూనివర్సిటీలు, విద్యాసంస్థలు పరిగణలోకి తీసుకుంటాయి. ప్రధానంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లోని యూనివర్సిటీల్లో టోఫెల్ స్కోరుకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. UKలోని 98 శాతానికి పైగా విశ్వవిద్యాలయాలు విశ్వవ్యాప్తంగా ఆమోదించబడ్డాయి.
టోఫెల్ దరఖాస్తు ప్రక్రియ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ETS) ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా యేటా 30 లక్షల మంది హాజరయ్యే ఈ బాష ప్రావీణ్య పరీక్ష ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాల్లో 4500కి పైగా పరీక్ష కేంద్రాలలో నిర్వహించబడుతుంది. టోఫెల్ పరీక్షకు రాసేందుకు ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. రెండు పరీక్షల మధ్య 3 రోజుల వ్యవధిలో ఏడాదిలో ఎన్నిమార్లు అయినా హాజరు కావొచ్చు. టోఫెల్ స్కోర్ వ్యాలిడిటీ 2 ఏళ్లు.