పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ వలలో పడ్డారు. డాక్యుమెంట్ల కోసం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్టారు. జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ల కోసం వచ్చిన పూదరి శ్రీనివాస్ నుండి 60 వేల రూపాయలు తీసుకుంటుండగా సబ్ రిజిస్టర్ దేవనగిరి నిర్మల, అటెండర్ శ్రీనివాసులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ భద్ర ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఇప్పటికే డాక్యుమెంట్ల కోసం డబ్బులు తీసుకున్నారని… మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.