HomeLATESTటెట్​ స్కోర్​ ఎంత వస్తే.. డీఎస్సీలో వెయిటేజీ ఎంత కలుస్తుంది.. పూర్తి వివరాలు

టెట్​ స్కోర్​ ఎంత వస్తే.. డీఎస్సీలో వెయిటేజీ ఎంత కలుస్తుంది.. పూర్తి వివరాలు

టీచర్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వటంతో విధివిధానాల తయారీపై విద్యాశాఖ కసరత్తు మొదలు పెట్టింది. జిల్లా సెలెక్షన్​ కమిటీ (DSC) ద్వారా ఈ నియామకాల ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం డీఎస్సీలో వచ్చే మెరిట్​, టెట్​లో వచ్చిన మార్కుల వెయిటేజీ, రిజర్వేషన్ల కోటా మేరకు సెలెక్షన్ జరుగుతుంది. ప్రతి జిల్లాల్లోనూ 95 శాతం మంది లోకల్. 5 శాతం మంది నాన్​ లోకల్ కోటా అమలవుతుంది. డీఎస్సీ రాత పరీక్షకు 80 శాతం మార్కులు, టెట్​ వెయిటేజీకి మిగతా 20 మార్కులను మెరిట్​ జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో టెట్​లో వచ్చే మార్కుల వెయిటేజీని ఎలా లెక్కిస్తారనేది అభ్యర్థులు తెలుసుకోవాల్సిన అవసరముంది. పూర్తి వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.

Advertisement

నేషనల్​ కౌన్సిల్​ ఫర్​ ఎడ్యుకేషన్​( ఎన్​సీటీఈ) రూల్స్​ ప్రకారం నిర్వహించే టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​కు (TS TET) కు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యత ఉంది. మొత్తం 150 మార్కులకు నిర్వహించే ఈ అర్హత పరీక్షలో అభ్యర్థి సాధించే మార్కుల్లో 20 శాతం మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)లో వెయిటేజీ ఇస్తారు. అందుకే దీనిని ఎలిజిబులిటీ టెస్ట్​గా కాకుండా అభ్యర్థులు పోటీపడి చదివి మార్కులు తెచ్చుకుంటారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 139 మార్కులు హయ్యస్ట్​ స్కోర్​గా నమోదైంది.

టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​ నిర్వహించకముందు అభ్యర్థులు నేరుగా ఉపాధ్యాయ నియామక పరీక్షకు (డీఎస్సీ/ టీఆర్​టీ) హాజరయ్యే వారు. అందులో వచ్చిన కటాప్​ మార్కులకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఫైనల్​ మెరిట్​ జాబితాను విడుదల చేసేవారు. అప్పుడు అర మార్కు తేడాతో ఉద్యోగాలను కోల్పోయేవారు. కానీ టెట్​ పరీక్షను ప్రవేశపెట్టిన తర్వాత 150 మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇవ్వడంతో పాయింట్లలో ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం టెట్​లో మంచి మార్కులు సాధిస్తే ఉద్యోగానికి చేరువైనట్టుగా అభ్యర్థులు భావిస్తున్నారు. మరోవైపు టెట్​లో ఉన్న 70 శాతం సిలబస్​ డీఎస్సీలోనూ ఉండడంతో టెట్​ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

టెట్​ స్కోర్​కు పర్సంటేజీ ఇలా..

టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​లో 150 మార్కులకు గాను ఒక అభ్యర్థి 110 మార్కులు సాధిస్తే.. 110÷150×20= 14.6 మార్కులను డీఎస్సీలో కలుపుతారు. అంటే డీఎస్సీలో 80 మార్కులకు గాను 60 మార్కులు సాధిస్తే.. 60+14.6 = 74.6 మొత్తం మార్కులుగా పరిగణించి మెరిట్​ తీస్తారు.

Advertisement

అదే విధంగా మరో అభ్యర్థి 135 టెట్​లో సాధించాడని అనుకుంటే 135÷150×20= 18 మార్కులను డీఎస్సీలో సాధించిన మార్కులకు కలుపుతారు. ఒకవేళ డీఎస్సీలో 80 మార్కులకు 65 మార్కులు సాధిస్తే 65+18=83 మార్కులు అభ్యర్థి సాధించినట్టుగా లెక్కగట్టి రిజల్ట్ ప్రకటిస్తారు. ప్రస్తుతం జనరల్​ అభ్యర్థులకు 90 మార్కులు, బీసీలకు 75, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 60 మార్కులు సాధిస్తే అర్హులుగా ఎంపిక చేస్తున్నారు.

మార్కుల వారీగా టెట్​ స్కోర్ ఎంత యాడ్ అవుతుందో కింది చార్ట్​లో తెలుసుకోండి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!