భారీ వర్షాల కారణంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు తెలంగాణ విద్యా శాఖ సెలవు ప్రకటించింది. ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలోని స్కూళ్లు కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించటం తెలిసిందే. భారీ వర్షాలు శుక్రవారం కూడా కొనసాగటంతో రాష్ట్రమంతటా విద్యా సంస్థలకు శనివారం కూడా సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Advertisement